విశాఖ పోర్టుకు ఇండియా గ్రీన్ ఎనర్జీ అవార్డు; అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా డేనియల్ జాంగ్; కృష్ణానదిలో లాంచీయాత్ర ప్రారంభం; తెలంగాణకు జాతీయ పురస్కారం; బార్టీ-వాండ్వెఘే జోడీకి మహిళల డబుల్స్ టైటిల్
1. విశాఖ పోర్టుకు ఇండియా గ్రీన్ ఎనర్జీ అవార్డు
విశాఖ పోర్టుట్రస్ట్కు ఇండియా గ్రీన్ ఎనర్జీ-2018 అవార్డు లభించింది.ఈ మేరకు ఢిల్లీలో సెప్టెంబర్ 10న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు అవార్డును అందజేశారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఉత్తమ ప్రగతి సాధించినందుకు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ ఈ అవార్డుకు విశాఖ పోర్టును ఎంపికచేసింది.
విశాఖ పోర్టుట్రస్ట్ యాజమాన్యం రూ.57.5 కోట్ల వ్యయంతో 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను విశాఖ విమానాశ్రయ ప్రాంతంలో నెలకొల్పి, మే 2017 నుంచి వాడుకలోకి తీసుకువచ్చింది. ఉత్పత్తి అయిన గ్రీన్ ఎనర్జీలో పోర్టు అవసరాలకు వినియోగించిన తర్వాత మిగులు విద్యుత్ను ఏపీఈపీడీసీఎల్కు విక్రయిస్తోంది.
2. అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా డేనియల్ జాంగ్
ఈ మేరకు 2019 సెప్టెంబర్ 10న జాంగ్ పదవీ బాధ్యతలు చేపడతారని అలీబాబా కంపెనీ సెప్టెంబర్ 10న వెల్లడించింది. ప్రస్తుతం అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్న జాక్ మా తన పదవీ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు. అయితే 2020లో జరిగే సర్వసభ్య సమావేశం వరకు తాను కంపెనీ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లలో ఒకడిగా కొనసాగుతానని చెప్పారు.
3. కృష్ణానదిలో లాంచీయాత్ర ప్రారంభం